ఇంటింటికి జనసేన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పోలిశెట్టి

రామచంద్రపురం నియోజకవర్గం: జనసేన పార్టీ రామచంద్రపురం నియోజకవర్గ ఇంచార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ ఇంటింటికి జనసేన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం గొల్లపాలెం గ్రామంలో కొలువై ఉన్న ధనమ్మ తల్లి అమ్మ వారిని దర్శించుకుని, ఆలయం వద్ద నుండి పోలిశెట్టి చంద్రశేఖర్ మరియు కాజులూరు మండల అధ్యక్షులు బోండా వెంకన్న ఆధ్వర్యంలో, జనసేన నాయకులు, జనసైనికులు ర్యాలీగా బయలుదేరి తణుకువాడ గ్రామం చేరుకుని గ్రామ ఎంపీటీసీ అభ్యర్థి మాతా సత్తిబాబు కలిసి తణుకువాడ గ్రామంలో ఇంటింటికి పర్యటించి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు ప్రజలకు తెలియజేసి నియోజకవర్గంలో వైసీపీ పాలన నుండి ఎటువంటి అభివృద్ధి లేని ప్రజలకు విముక్తి కలిగించే విధముగా మీ ఓటును గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయవలసిందిగా పోలిశెట్టి చంద్రశేఖర్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాజులూరు మండల అధ్యక్షులు బోండా వెంకన్న, రూరల్ మండలాధ్యక్షులు పోతాబత్తుల విజయ్ కుమార్, గంగవరం మండల అధ్యక్షులు చిర్రా రాజకుమార్, నియోజకవర్గ సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, తదితర జనసేన నాయకులు జన సైనికులు పాల్గొనడం జరిగింది.