ఇకపై ౩౦రోజులు ముందే టికెట్ రిజర్వేషన్ చేసుకునే అవకాశం: APSRTC

APSRTC ప్రయాణికుల అడ్వాన్స్ టికెట్ బుకింగ్‌ పద్ధతిలో 30 రోజులు ముందుగా టికెట్ రిజర్వేషన్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రయాణికులకు కూడా గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల టికెట్ రిజర్వేషన్ గడువును 30 రోజులకు పెంచినట్టు ఆర్టీసీ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు.

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటి వరకు 7 రోజులు ముందుగా మాత్రమే టికెట్ రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉండగా తాజాగా ఆ విధానంలో మార్పులు తీసుకొస్తూ ఏపీఎస్ ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్రహ్మానంద రెడ్డి వెల్లడించారు. ముందస్తుగా దూర ప్రయాణాలు ప్లాన్ చేసుకునే ప్రయాణికులకు ముందుగానే టికెట్ బుక్ చేసుకునే ఈ అవకాశం కచ్చితంగా కలిసొచ్చే అంశమే అవుతుంది.