కళ్యాణదుర్గం, ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మార్చి-14ను విజయవంతం చేసే సన్నాహక సమావేశంలో కళ్యాణదుర్గం నియోజవర్గ జనసేన పార్టీ తరఫున జనసేన ఇంచార్జ్ బాల్యం రాజేష్, జనసేన జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్యతో పాటు నియోజవర్గ జనసేన నాయకులు, వీరమహిళలు, మండల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, జనసైనికులు అందరూ కలిసి అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ బాల్యం రాజేష్ ప్రసంగిస్తూ.. పిఠాపురంలో ఈనెల 14వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్న జనసేన ఆవిర్భావ సభకు కళ్యాణదుర్గం నియోజకవర్గ జనసేన పార్టీ నుండి జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, అభిమానులు అందరూ కలిసి పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో తరలి రానున్నట్లు తెలియజేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం నుండి జనసేన ఆవిర్భావ సభకు యుద్ధ ప్రతిపాదికన తరలి రావడానికి జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, అభిమానులు అందరూ సిద్ధంగా ఉన్నాము అని తెలిపారు.
Share this content:
Post Comment