బొబ్బిలిలో ఆవిర్భావ సభ పోస్టర్ల ఆవిష్కరణ

బొబ్బిలి జనసేన పార్టీ కార్యాలయంలో మార్చి 14 తేదిన పిఠాపురంలో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభ పోస్టర్లను బొబ్బిలి జనసేన పార్టీ ఇంచార్జి గిరడ అప్పలస్వామి మరియు బొబ్బిలి జనసేన నాయకులు పెద్దింటి మనోజ్ కుమార్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో బొబ్బిలి జనసేన నాయకులు అడబాల నాగు, పొట్నూరు జనార్దన్, పొట్నూరు రామకృష్ణ, గండేటి శ్రీను, పైలా హరి ప్రసాద్, జమ్మూ గణేష్, వీర మహిళలు వరలక్ష్మి, రామలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొబ్బిలి నియోజకవర్గం జనసైనికులకి జనసేన నాయకులకి వీర మహిళలకి తెలియజేయునది ఏమనగా మార్చి 14వ తేదీన పిఠాపురంలో చిత్రాడ గ్రామం వద్ద జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరుగుతుంది. కావున ఈ ఆవిర్భావ సభలో ప్రతి ఒక్కరు పాల్గొని జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేసి విజయవంతం చేస్తారని కోరుచున్నామని అన్నారు.

Share this content:

Post Comment