42 డివిజన్ ప్రజల సమస్యలను తెలుసుకున్న పోతిన మహేష్

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం: పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్, 42 డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష గురువారం 42 డివిజన్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ప్రియదర్శిని కాలనీలో తాగునిటీ సమస్యల గురించి, హెచ్ బి కాలనీలో డ్రైనేజీ సమస్యల గురించి అదే విధంగా రోడ్ల సమస్య గురించి ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిండిపోయింది అంటే వెంటనే మమ్మల్ని పట్టించుకునే నాధుడే లేడు అని ఆ యా కాలనీ ప్రజలు వాపోయారు. కార్పొరేషన్ కమిషనర్ మరియు అధికారులతో మాట్లాడి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా పోతిన మహేష్ హామీ ఇచ్చారు.