చల్లపల్లి జనసేన ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
చల్లపల్లి: అమరజీవి పొట్టి శ్రీరాములు 122 జయంతిని పురస్కరించుకుని చల్లపల్లి మండలం, చల్లపల్లిలో పెద్దకర్లపల్లి రోడ్డు నందుగల ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసి ఉన్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి జనసేన పార్టీ తరపున పూలమాలవేసి పుష్పాంజలి ఘటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ కార్యదర్శి హరి గోపాల్, జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి ఉస్మాన్ షరీఫ్, జనసేన పార్టీ చల్లపల్లి మండల వైస్ ప్రెసిడెంట్ ఉరిమి మణికంఠ, కార్యదర్శులు గొల్ల ప్రసాద్, సోమిశెట్టి రాఘవ, మోపిదేవి మండల కమిటీ సభ్యులు భోగి రెడ్డి సాంబశివరావు, కలపాల ప్రసాద్, జనసైనికులు పినిశెట్టి నిరంజన్, పసుపులేటి రవి, లక్ష్మీనారాయణ స్థానికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-16-at-7.08.20-PM-1024x621.jpeg)