చేసిన మేలుకు రుణం తీర్చుకుంటున్న ప్రభాస్..

16 ఏళ్ల కింద ఓ దర్శకుడు తనకు ఇచ్చిన విజయాన్ని ఇంకా గుర్తు పెట్టుకున్నాడు ప్రభాస్. ఆయన చనిపోయినా కూడా ఇప్పుడు తన కొడుకును హీరోగా నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ దర్శకుడే శోభన్.. ఆ సినిమా వర్షం. ప్రభాస్ కెరీర్‌లో ఫస్ట్ బిగెస్ట్ బ్లాక్‌బస్టర్ వర్షం. 2004 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ప్రభాస్ మార్కెట్‌ను పదింతలు పెంచేసింది. అప్పటికి ఈశ్వర్, రాఘవేంద్ర సినిమాలు పెద్దగా ఆడకపోయేసరికి వర్షంతోనే స్టార్ అయ్యాడు ప్రభాస్. ఈ సినిమా హిట్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు ఈ హీరో. ఇదిలా ఉంటే ఇలాంటి బ్లాక్‌బస్టర్ సినిమాను తనకు ఇచ్చిన శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ ఇప్పుడు హీరోగా గుర్తింపు కోసం తంటాలు పడుతున్నాడు. శోభన్ చనిపోయిన తర్వాత కూడా ఆ కుటుంబాన్ని చూసుకుంటున్నాడు ప్రభాస్. ఇప్పుడు ఆయన కొడుకు సంతోష్ శోభన్ కెరీర్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు ప్రభాస్. తన సొంత బ్యానర్ యువీ క్రియేషన్స్‌లో సంతోష్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. సంతోష్ శోభన్ ఇప్పటికే ‘తాను-నేను’ , ‘పేపర్ బాయ్’ సినిమాల్లో హీరోగా నటించాడు. ఆ సినిమాలు అంతగా ఆడలేదు. కానీ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే ఇప్పుడు హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ప్రభాస్. అప్పుడు శోభన్ చేసిన సాయాన్ని గుర్తు పెట్టుకుని ఇప్పుడు అతడి కొడుకు బాధ్యత తీసుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఈ సినిమా కోసం మోడల్ కమ్ హీరోయిన్ కావ్య థపర్‌ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. మరి ప్రభాస్ తీసుకుంటున్న ఈ బాధ్యత ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.