గ్రామసేవకులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపిన ప్రత్తిపాడు జనసేన

ప్రత్తిపాడు, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సేవకులు చేస్తున్న నిరసన దీక్ష కార్యక్రమాల్లో భాగంగా ప్రత్తిపాడు మరియు ఏలేశ్వరం తహశీల్దార్ కార్యాలయాల వద్ద గ్రామసేవకులు చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో జనసేన పార్టీ తరపున ప్రత్తిపాడు జనసేన పార్టీ ఇన్చార్జి వరుపుల తమ్మయ్య బాబు, ఏలేశ్వరం మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు పెంటకోట మోహన్, ఏలేశ్వరం నగర పంచాయతీ జనసేన పార్టీ అధ్యక్షులు అధికార్ పాల్గొని వారికి మద్దతు ఇవ్వడం జరిగింది. గ్రామ సేవకులు చేస్తున్న న్యాయబద్ధమైన తమ కోర్కెలు హక్కుల సాధన కోసం నిరసన చేయటం అత్యంత బాధాకరం అని ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ గారు  తెలియజేశారు. వారు చేసే ప్రతి ఉద్యమానికి జనసేన పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలియజేశారు. అంతేకాకుండా  వీఆర్ఏలకు 21000 వేతనం ఇవ్వాలి, ఇచ్చిన డి.ఎ రికవరీ ఉత్తర్వులు ఉపసంహరించుకుని డి.ఎ లతో కూడిన వేతనం ఇవ్వాలి, నామినిలుగా పనిచేస్తున్న వారందరినీ వీఆర్ఏలు గా నియమించాలి, అర్హులందరికీ కూడా ప్రమోషన్లు ఇవ్వాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్ని వర్తింపజేయాలి, 65 సంవత్సరాలు దాటి చనిపోయిన వీఆర్ఏ కుటుంబంలో కాంపన్సేట్ క్రింద ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి జనసేన పార్టీ తరఫున ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జి డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గం యువ నాయకులు సాయికిరణ్, ఏలేశ్వరం మండల జనరల్ సెక్రెటరీ మరియు సోషల్ మీడియా కన్వీనర్ గంగిరెడ్ల మణికంఠ ఇతర జనసైనికులు పాల్గొన్నారు.