యంగెస్ట్ సి.ఈ.ఓ అవార్డు కైవసం చేసుకున్న ప్రవీణ్ మొగసాటి

కెన్యా, కెన్యాలో నివసిస్తున్న రాజమండ్రికి చెందిన ఎన్నారై జనసేన నాయకులు మరియు జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ సభ్యులు ప్రవీణ్ మొగసాటి యంగెస్ట్ సి.ఈ.ఓ అవార్డును కైవసం చేసుకోగా డిసెంబర్ 2వ తేదీన కెన్యాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ అవార్డును ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ సభ్యులు మాట్లాడుతూ… ప్రవీణ్ మొగసాటి యంగెస్ట్ సి.ఈ.ఓ అవార్డు అందుకోవడం చాలా గర్వకారణమని, యువతకు ప్రవీణ్ ఎంతో ఆదర్శమని, ప్రవీణ్ మొగసాటికి జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ తరపున మరియు జనసేన తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నామని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. అన్నారు.