ప్రియాంక కుటుంబాన్ని పరామర్శించిన గర్భాన సత్తిబాబు

పాలకొండ, జనసైనికుల సహాయ సహకారంతో శుక్రవారం, పాలకొండ నియోజకవర్గంలో మరణించినటువంటి పాలకొండ గారమ్మ కాలనీలో ప్రియాంక అనే స్త్రీ ముగ్గురు ఆడపిల్లలను కనిందని తన భర్త తన పుట్టింటి వద్ద వదిలి వెళ్లి పోవడం మరియు భర్త వేధింపులు తట్టుకోలేక మానసికంగా బలహీనమై ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ఇది తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆ బాధిత కుటుంబాన్ని ఓదార్చి 11000/-ఆర్థిక సహాయం అందించారు. అలాగే ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.