జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం..!

రంపచోడవరంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ మరియు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను పురస్కరించుకొని పార్లమెంట్ సమన్వయ కర్త, సాంస్కృతిక కమిటీ సభ్యులుగా నియమితులైన డా.వంపూరు గంగులయ్య, రాష్ట్ర పర్యావరణవేత్త జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, మరో సమన్వయ కర్త పి.ఆదినారాయణ రంపచోడవరం ఇంచార్జీ కుర్ల రాజశేఖర్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ రాష్ట్రంలో బలమైన శక్తిగా అవతరించి నేటికీ మార్చి 14వ తేదీతో 11 సంవత్సరాలు పూర్తిచేసుకొని దిగ్విజయంగా 12వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో అందరూ ఐకమత్యంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆటంకాలు లేకుండా చిత్త శుద్ధితో బాధ్యతగా ఘనంగా నిర్వహించేలా అందరూ బాధ్యతగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చేయవలసినదిగా పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన వైసిపి అనే రాక్షస పాలనను అంతమొందించడానికి నిరంతరం కృషి చేసి టీడీపీ-బీజేపీ పార్టీలతో జతకట్టి రాష్ట్రానికి పునర్వైభవం తీసుకొచ్చిన జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ సంకల్పం గొప్పదని, అందరూ ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను, ప్రజల దృష్టికి తీసుకెళ్లి, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి అందరూ సమిష్టిగా కృషి చెయ్యవలసినదిగా కోరుచున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకి స్వామి, ఎస్ శ్రీను, వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు, వీరమహిళలు జనసైనికులు, జనసేన శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-03-02-at-6.16.55-PM-1024x576 జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం..!

Share this content:

Post Comment