పురాతన ఆలయాల పరిరక్షణ ప్రజల బాధ్యత: ఎమ్మెల్యే జయకృష్ణ

పాలకొండ నియోజకవర్గం, పురాతన ఆలయాల పరిరక్షణ ప్రజల భాద్యత అని పాలకొండ నియోజకవర్గ ఎన్.డి.ఏ కూటమి జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. పాలకొండలో వేంచేసి ఉన్న, పురాతనమైన శ్రీశ్రీశ్రీ సీతారామస్వామి దేవస్థానం ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే హజరయ్యరు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయకృష్ణ ఆలయ విశేషాలను, ప్రతిష్టాపన మహోత్సవ వివరాలను తెలుసుకున్నారు. దేవాలయానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున ఎటువంటి సేవలు అవసరమైన తనవద్దకు తీసుకుని వస్తే సత్వరమే ఈ సమస్యలను పరిష్కరిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అనేకమంది మహిళలు, భక్తులు విచ్చేసి ఎమ్మెల్యేకి తమ సమస్యలు వివరించి ఆదుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఆలయాలు అభివృద్ధి కోరకు ఎప్పుడు అండగా ఉంటుందని కూటమి జనసేన ఎమ్మెల్యే జయకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి శేషాచార్యులు, పాలకొండ తెలుగుదేశం పట్టణ పార్టీ అధ్యక్షుడు గంటా సంతోష్, జనసేన పాలకొండ పట్న అధ్యక్షులు ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులు కొండదాడి రాజేష్, కొండపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment