రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి

  • పవన్ కళ్యాణ్ కు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు రక్షణ కల్పించండి
  • అన్నమయ్య జిల్లా అడిషనల్ యస్.పి డా. రాజ్ కమల్ కు వినతిపత్రం

రాజంపేట: ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య బద్దంగా కాపాడాలని, పవన్ కళ్యాణ్ కు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు రక్షణ కల్పించమని అన్నమయ్య జిల్లా అడిషనల్ యస్.పి డా. రాజ్ కమల్ కు జనసేన పార్టీ తరఫున శుక్రవారం వినతిపత్రం అందజేసారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఐదువేల రూపాయల జీతంతో వెట్టి చాకిరీ చేయించుకుంటూ 50 ఇండ్లకు ఒక నాయకుడిని చేస్తానంటూ భవిష్యత్తు మీదేనంటూ సామాన్య ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ వైసీపీ పాలన సామాన్య ప్రజలను భయాందోళన గురిచేస్తుంది కాబట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి జనసేన కార్యకర్తలకు కూడా వైసిపీ వారి నుండి రక్షణ కావాలని కోరుకుంటూ.. ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య బద్దంగా కాపాడాలని, దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా మనవి చేసుకుంటున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వశివుల్లా, దినేష్, శివ, రెడ్డిశేకర్, సురేష్, శివయ్య, కృష్ణ, ప్రశాంత్, మహేష్, అంజి, చంటి తదితరులు పాల్గొన్నారు.