పోలవరం జనసేన ఆధ్వర్యంలో అక్రమ అరెస్టులకు నిరసన

పోలవరం, విశాఖలో పాలకుల ధాష్ఠీకం జనసేన నాయకుల్ని అక్రమ అరెస్టులకు నిరసనగా సోమవారం పోలవరం నియోజకవర్గం కొయ్యలగుడెం సెంటర్లో నిరసన కార్యక్రమం ఇంచార్జి చిర్రి బాలరాజు అద్వర్యంలో జరిగింది. కిలోమీటర్‌ దూరం ర్యాలీగా వెళ్ళి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ విలువలు కాపాడాలని నినదిస్తూ నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం నాగకృష్ణ, కొయ్యలగూడెం మండల అద్యక్షులు తోట రవి, ఏపూరి సతీష్‌, మాదేపల్లి శ్రీనివాస్, చోడిపిండి సుబ్రహ్మణ్యం, ప్రగడ రమేష్‌, అడపా నాగరాజు, చెప్పుల మధు, మేడిన కన్నయ్య, పైదా పోతురాజు భారిసంఖ్యలో జనసైనికులు అభిమానులు పాల్గొన్నారు.