తుమ్మి లక్ష్మి రాజ్ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన

విజయనగరం, జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శలను, పిఏసి సభ్యులను జిల్లా నాయుకులని అక్రమంగా అరెస్ట్ చేసిన విధానాన్ని ఖండిస్తూ విజయనగరం బాలాజీ జంక్షన్ వద్ద వీరమహిళ విభాగం ఉత్తరాంధ్ర మహిళ రీజనల్ కో-ఆర్డినేటర్ తుమ్మి లక్ష్మి రాజ్ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఉత్తరాంధ్రలో కొండలు, చెరువులు, గెడ్డలు కబ్జాలకు సరిపోవని ఇప్పుడు రోడ్లు కూడా కబ్జా చేస్తున్న వైసీపీ వైఖరిని ఎండ కడుతూ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేనేత వికాస విభాగం రాష్ట్ర కార్యదర్శి కాటం అశ్విని, వీర మహిళలు, గంట్లన పుష్ప, మాత గాయత్రి, వరలక్ష్మి, జ్యోతి, పద్మ, అలెక్య, నెల్లిమర్ల నియోజకవర్గ మండల అధ్యక్షులు పతివాడ అచ్చుం నాయుడు, పతివాడ కృష్ణవేణి, జలపరి అప్పడుదొర, జనసేన నాయుకులు తుమ్మి అప్పలరాజు దొర, రవితేజ, సతీష్, రామకృష్ణ, దిండి రామారావు, పైల శ్రీను, అనిల్, ప్రసాద్ తదతరులు పాల్గొన్నారు.