జమ్ముకాశ్మీర్లోని బైసారన్ దగ్గర పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు, జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ నేతృత్వంలో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దాడిలో మరణించిన పర్యాటకుల పట్ల మౌనప్రార్ధన పాటించి, అదే ఘటనలో అమరుడైన జనసేన కార్యకర్త సోమిశెట్టి మధుసూదన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఇమ్మడి కాశీనాథ్ మాట్లాడుతూ, మన దేశం లౌకికతకు ప్రతిరూపంగా నిలుస్తుండగా, ఇలాంటి ఉగ్రదాడులు శాంతిని భంగం చేస్తాయన్నారు. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా వారికి తగిన శిక్ష పడాల్సిందేనని, దేశానికి జరిగిన ఈ ద్రోహానికి ప్రతీకారం తప్పదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొందిలి కాశీరామ్ సింగ్, జిల్లా కార్యదర్శి శిరిగిరి శ్రీనివాసరావు, నాయకులు విజయరావు, నరసింహారావు, పఠాన్ షఫీ, తర్లుపాడు మండల అధ్యక్షులు చేతుల శ్రీనివాసులు, కంబం వెంకట రమణ, ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు వీరిశెట్టి శ్రీను, ఆవుల వెంకట్, బట్టగిరి మురళీధర్ రెడ్డి, వెలుగు కాశీరావు, గుండెబొమ్ము శ్రీను, సునీల్, మహేష్, రసూల్ తదితరులు పాల్గొన్నారు. జనసేన వీరమహిళలు పిన్నెబోయిన లక్ష్మీ రాజ్యం, పూజా లక్ష్మీ, వాసవి ప్రియా, బాలబాయి మరియు నాయకులు పిచ్చయ్య, శివ సింగ్, మణికంఠ, ఈర్ణపాటి సుబ్బారావు, రఘు, అనిల్ ఇతర కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Share this content:
Post Comment