అనకాపల్లి టీం జనసేన ఆధ్వర్యంలో నిరసన

అనకాపల్లి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి రక్షణ చేపట్టాలని దానిపై తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తక్షణమే రక్షణ కల్పించాలని ప్రభుత్వంకి గురువారం నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకత్వంలో నిరసన కార్యక్రమం చేయిడం జరిగింది. మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని తక్షణమే కేంద్ర ప్రభుత్వం జడ్ హేటగిరి సెక్యూరిటీ కేటాయించాలి. మొన్న వైజాగ్ జరిగినటువంటి కార్యక్రమంలో కూడా అవకతవకలు జరిగాయని నోవాటెల్ హోటల్ నుంచి మా నాయకుడు తిరిగి వెనక్కి పంపించడం జరిగింది. అదేవిధంగా ఆయనకి రక్షణ కల్పించలేక ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకుండా ప్రశ్నించే గొంతును నొక్కేస్తుంది అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి రక్షణ కల్పించాలని. ప్రధానమంత్రి కార్యాలయానికి పోస్ట్ కార్డు ద్వారా మా యొక్క డిమాండ్లు తెలియజేస్తూ. అనకాపల్లి టీం జనసేన ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.