ఘనంగా రేఖ గౌడ్ జన్మదిన వేడుకలు

జనసేన పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ రేఖ గౌడ్, జన్మదిన వేడుకల్ని ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు, ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయానికి చేరుకున్న నాయకులు,కార్యకర్తలు, పార్టీ కార్యాలయం నుంచి సోమప్ప సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సోమప్ప విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సోమప్ప సర్కిల్ లొనే నాయకులు, కార్యకర్తలు, ఆధ్వర్యంలో రేఖ గౌడ్, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పార్టీ కార్యాలయానికి చేరుకొని 30 మంది దివ్యాంగులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రేఖా గౌడ్, మాట్లాడుతూ నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపు కుంటునానన్ని ఇంతటి ఆదర అభిమానాన్ని చూపిస్తున్న ఎమ్మిగనూరు నియోజకవర్గ జనసేన నాయకులకు, జనసైనికులకు, ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నీ ఇదే స్ఫూర్తిని కొనసాగించి ప్రతి ఒక్క నాయకుడు, జనసైనికులు, పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, జనసేన పార్టీ మండల అధికార ప్రతినిధి రాహుల్, సాగర్, కర్ణం రవి, గాజుల వెంకటేష్, షబ్బీర్, రషీద్, వెంకటేష్, రమేష్, అంజి, మరియు, కందనాతి, కడివేల్ల, గుడికల్, శ్రీరామ్ నగర్, కోటేకల్, దేవిబెట్ట, పెసలదీన్నే, కలగట్ల, తదితర గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.