మహిళలకు పిఎస్ఎన్ మూర్తి టీం క్రిస్మస్ కానుక

పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఉదయ్ ఆదేశాల మేరకు ఉప్పాడ కొత్తపల్లి మండలం పొన్నాడ, దళిత సోదరుల కాలనీలో జనసేన పార్టీ తరఫున పిఎస్ఎన్ మూర్తి టీం మహిళలకు క్రిస్మస్ కానుక బియ్యం కూరగాయలు ఇవ్వడం జరిగింది. జనసేన, తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడుతున్న పీఎస్ఎన్ మూర్తి టీం పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా జనసేన తెలుగుదేశం ఉంది అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నామని పీ ఎస్ఎన్ మూర్తి తెలియజేశారు. జనసేన తెలుగుదేశం కూటమితో పిఠాపురం నియోజకవర్గం అత్యంత మెజారిటీతో విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. మూర్తి ఈ కార్యక్రమంలో తెలుగు దేశం నాయకుల వడ్డి రాజు గార శీలం, ఏసుబాబు, జనసేన నాయకులు నల్లి అప్పాజీ, నల్లి చిన్నబాబు, నల్లి నాగార్జున, వడ్డి మున్నా (జనసేన యూత్) పెండి శ్రీనివాస్, పెంకే జగదీష్, కోలా దుర్గాదేవి, పబ్బిరెడ్డి ప్రసాద్, పెద్దిరెడ్ల భీమేశ్వరావు, నామ శ్రీకాంత్, మరియు పి.ఎస్.ఎన్ మూర్తి నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.