*సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బోబ్బేపల్లి సురేష్ నాయుడు
సర్వేపల్లి నియోజకవర్గం, జనసేన పార్టీ సమన్వయకర్త బోబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో గురువారం పవన్ కళ్యాణ్ పై జగన్ విమర్శలు ఖండిస్తూ జగన్ దిష్టిబొమ్మని తగలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా బోబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సైకో జగన్ చిప్ప కూటికి ఎక్కువ.. బొచ్చు కూటికి తక్కువ, కోడి కత్తికి ఎక్కువ.. గొడ్డలి పోటుకి తక్కువ, గులకరాయికి ఎక్కువ.. బండరాయికి తక్కువ, తెలుగు చదవడానికి ఎక్కువ.. ఇంగ్లీషు మాట్లాడడానికి తక్కువ, బెయిల్ కి ఎక్కువ.. జైలుకి తక్కువ, అభివృద్ధికి తక్కువ.. అవినీతికి ఎక్కువ, సంస్కారానికి తక్కువ.. సవట మాటలకు ఎక్కువ. జగన్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత స్థాయి నీకు లేదు అమాయకులైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నువ్వేదో ఉద్దరిస్తావని ఒకసారి అవకాశం కల్పించారు. మళ్లీ మళ్లీ నిన్ను నమ్మే పరిస్థితి లేదు కాబట్టే 11 సీట్లకు పరిమితం చేసిన ఇంకా నీకు సిగ్గు రాలేదు. నీ కార్యకర్తలకి, నీ నాయకులకి నోరు అదుపులో లేదు కాబట్టే ఒక్కొక్కరిగా ఊచలు లెక్కపెడుతున్నారు. త్వరలోనే నువ్వు కూడా ఊచలు లెక్కబెట్టే సమయం ఆసన్నమైంది. ప్రజలు బుద్ధి చెప్పినా నీకు ఇంకా సిగ్గు రాలేదు. ఇంకెప్పుడూ తెలుసుకుంటావు జగన్ తెలుసుకున్న ఉపయోగం లేదు నీకు. రాష్ట్రవ్యాప్తంగా నీ దిష్టిబొమ్మలు మాత్రమే తగలబెట్టారు ఇకనుంచి జనాల్లోకి కూడా రాలేవు జగన్ గుర్తుపెట్టుకో. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మీనేని వాణి భవాని నాయుడు, సందూరి శ్రీహరి, ముత్తుకూరు మండల నాయకులు అశోక్, ఏలికం గిరీష్, మస్తాన్, సుమన్, కిషోర్, చిన్న తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment