నిమ్మలపాడులో (ఏపీఎండీసీ) మైనింగ్ మాఫియాకు కొమ్ము కాస్తున్న ప్రజా ప్రతినిధులు: జనసేన ఆరోపణ

నిమ్మలపాడు గ్రామంలో (ఏపీఎండీసీ) మైనింగ్ మాఫియా!.. ఈ విషయం పై జనసేన పార్టీ మండల అధ్యక్షులు సిహెచ్ మురళి మాట్లాడుతూ.. నిమ్మలపాడు గ్రామంలో బ్లాస్టింగ్ పర్మిషన్ లేకుండా ఏపీఎండీసీ వారు ఎలా బ్లాస్టింగ్ చేయుచున్నారు?.. అసలు పీసా చట్టం ప్రకారముగా 5వ షెడ్యూల్ ప్రాంతంలో గ్రామసభ నిర్వహించకుండా.. ఏపీఎండీసీ వారు ఏ విధంగా అనుమతి తీసుకుని ఉన్నారు. దొంగచాటున అనుమతి పొందినట్టు తెలుస్తుంది. ఇది గిరిజనులను, గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతున్నట్లే. పీసా చట్టం లాంటి బలమైన చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎస్టీ కమిషన్ చైర్మన్, ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉండగా.. వీరంతా ప్రజల పక్షాన ఉన్నట్టా.. లేనట్టా? లేదా బినామీల పక్షంగా ఉన్నట్టా?.. అసలు గిరిజన ప్రాంతంలో మైనింగ్ గ్రామ సభ తీర్మానం తప్పనిసరి. అది కూడా అఖిలపక్ష రాజకీయ ప్రజా సంఘాల మధ్య అందరి సమక్షంలో కలసి పంచాయతీ సెక్రెటరీ మరియు మండల ఎంపిడిఓ వారు అధికారికంగా నోటీసులు ఇచ్చి పిలిపించి గ్రామ సభ నిర్వహించవలసి ఉన్నది. కానీ ఎందుకు జరగలేదు ఎస్టీ కమిషన్ అరకు పర్యటనలో మైనింగ్ మీద ఫిర్యాదు చేసినప్పటికీ కనీసం ఎందుకు స్పందించలేదు. అసలు ఎస్టీ కమిషన్ ఉన్నది ఎవరి గురించి..? ప్రజల కోసమా లేక మైనింగ్ మాఫియా కోసమా..? పీసా చట్టం ప్రకారం 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఏపీఎండీసీ ఒక ప్రైవేటు సంస్థే. గిరిజన చట్టాలను కాపాడాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యే, ఎంపీ, ఎంపీపీ, ఎంపిటిసిలు, సర్పంచులు, ప్రజాసంఘాలు అందరిమీద ఉంది. కావున దీనిపై జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అని అన్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో అనంతగిరి మండల జనసేన నాయకులు గుజ్జల మంగళ, కొర్రా ప్రవీణ్, గేమేల సన్యాసి రావు, కొర్రా రమేష్, దండుసేన నవీన్ కుమార్, వీరమహిళాలు, రత్న ప్రియా, వాణి పాల్గొన్నారు.