తిరుమల 14వ మహా పాదయాత్రలో భాగంగా స్థానిక శివాలయంలో పూజలు

రాజంపేట: శనివారం సాయంత్రం అన్నమయ్యజిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి.సుండుపల్లి మండల కేంద్రంలో తిరుమల14వ మహా పాదయాత్రలో భాగంగా స్థానిక శివాలయంలో ఉదయం నుంచి స్వామి వారికి అభిషేకం, కళ్యాణం, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం వివిధ రకాల సాంస్కృతిక, సాంప్రదాయ పద్ధతిలో కళాకారులతో డప్పు వాయిద్యాలు, చెక్కభజనలు, బాణసంచాలతో అంగరంగ వైభవంగా స్వామి వారిని ఊరేగింపుగా ఘనంగా గ్రామోత్సవం చేపట్టిన ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు, భక్తులతో కలిసి స్వామి వారికి పూజ చేసి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరిగింది.