వైసిపి వ్యాఖ్యలను ఖండించిన పుంగనూరు జనసేన నాయకులు

పుంగనూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసిపి నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలు పట్ల పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజా సమస్యల పరిష్కారంలో నిరంతరం పోరాటం చేస్తూ సమస్యల పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ కృషిచేస్తున్నారని, ఆయననిని విమర్శిస్తే ఊరుకొనేది లేదని చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న రాయల్ ఘాటుగా స్పందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు శ్రీనివాసులు, మణికంఠ, పాముల హరి, చైతన్య, బాలు, పట్టణ అధ్యక్షుడు గాజుల నరేష్, సబ్బు, బబ్లూ, మండల నాయకులు పాల్గొన్నారు.