పురంధేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసిన గురాన అయ్యలు
విజయనగరం, విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని మంగళవారం జనసేన నేత గురాన అయ్యలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. జగన్ సర్కార్ తీరును ఎండగడుతున్న పురంధేశ్వరికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు కాటం అశ్విని, పితాల లక్ష్మీ, దుప్పాడ జ్యోతి, ఏంటి రాజేష్ , ఎల్ రవితేజ, ఎమ్.పవన్ కుమార్, వజ్రపు నవీన్ కుమార్, పృథ్వీ భార్గవ్, అభిలాష్, గొల్లపల్లి మహేష్, మధు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-28-at-14.38.42-1024x759.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-28-at-14.38.43-768x1024.jpeg)