పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పరిచయ కార్యక్రమం
ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ జనసేన-టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఆహ్వానం మేరకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఆన్ని నియోజకవర్గాల జనసేన-టీడీపీ-బీజేపీ ఇన్చార్జిలకు ఆయన ఏర్పాటు చేసిన పరిచయ కార్యక్రమం, అల్పాహార విందు, తదనంతరం జరిగిన ప్రెస్ మీట్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త డా.ఘంటసాల వెంకటలక్ష్మి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగ రాష్ట్ర వైస్ చైర్మన్ మోరు వెంకట నాగరాజు, జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి ముత్యాల రాజేష్, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ మెంబర్ బొడ్డు గిరిబాబు,మాదేపల్లి మాజీ సర్పంచ్, త్వరలో జనసేన పార్టీలో జాయిన్ అవ్వబోయే కోసూరి వెంకట సుబ్బారావు, మాదేపల్లి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు మోటేపల్లి పవన్ మరియు జనసేన-టీడీపీ-బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-01-at-19.15.37-1024x768.jpeg)