వి.ఆర్.ఏ లు చేస్తున్న దీక్షకు పుట్టపర్తి జనసేన మద్దతు

పుట్టపర్తి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వి.ఆర్.ఏ ల నిరసన దీక్షలు పుట్టపర్తి తహసీల్దార్ కార్యాలయం ముందు వి.ఆర్.ఏ లు చేస్తున్న దీక్షకు జనసేన పార్టీ మద్దతు తెలపడం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ మాట్లాడుతూ…
1)ప్రస్తుతపరిస్థితులు 10,500/-రూపాయలతో జీవన సాగించడం కష్టం. వైస్సార్ ప్రభుత్వం వచ్చాక నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
2)అదే విధంగా నామినిలుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలి.
3) 2017లో అప్పుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వి.ఆర్.ఏ ల దీక్షకు వెళ్ళి తను అధికారంలోకి వచ్చిన మొదటి వారంలోనే 15000/-రూపాయలు ఇస్తానన్నారు. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అయిన కూడా 10/- రూపాయలు పెంచిన దాఖలాలు లేవన్నారు. అంతేకాకుండా వారికి ఇస్తున్న టా మరియు డా లను కూడా వాపస్ తీసుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా వారి డిమాండ్లను ఒప్పుకొని వారికి తగిన న్యాయం చెయ్యాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేసారు. వి.ఆర్.ఏ ల పోరాటానికి జనసేన పార్టీ అండ ఉంటుందని మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బొగ్గరం శ్రీనివాసులు, పార్టీ నాయకులు డాక్టర్ తిరుపతేంద్ర, బోయ వంశీ, సాయి ప్రభ, మేకల పవన్ కళ్యాణ్, అభి, రాము తదితరులు పాల్గొన్నారు.