పైడపర్తి సత్య సాయిబాబుకి నివాళులర్పించిన బొంతు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, రాజోలు మండలం, కాట్రేనిపాడు గ్రామంలో అకాల మరణం చెందిన టీచర్ పైడపర్తి సత్య సాయిబాబు చిత్రపటానికి రాజోలు జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అడబాల శ్రీనివాస్ రావు, గ్రామశాఖ అధ్యక్షులు రేఖపల్లి దొరబాబు, మురళీ తదితరులు పాల్గొన్నారు.