పోలీసు అమరవీరులకు రైల్వేకోడూరు జనసేన ఘననివాళి

రైల్వేకోడూరు, పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ రైల్వేకోడూరు విభాగం నాయకులు గంధంశెట్టి దినకర్ బాబు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుల త్యాగాలు నిరుపమానం. అసువులు బాపిన భారత ముద్దుబిడ్డలందరికీ జోహార్లు అని పేర్కొన్నారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేము. ప్రతి ఒక్కరూ ఏ ఆపదకైనా ఆశ్రయించేది పోలీసులనే. ప్రభుత్వం అంటే ముందుగా గుర్తొచ్చేది పోలీసు. శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం శ్రమిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణకు కొరకు అంకితభావంతో. ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ప్రాణ త్యాగాలు చేసిన పోలీసు అమరవీరులకు ఘనంగా జోహార్లను తెలిపారు. ఈ సమావేశంలో కాపు సంక్షేమ సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎద్దల అనంతరాయలు మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.