గుడ్ మార్నింగ్ సీఎం సార్ క్యాంపెయిన్ లో రైల్వే కోడూరు జనసేన

రైల్వే కోడూరు నియోజకవర్గంలో పట్టణంలోని దెబ్బతిన్న పలు రోడ్లపై నేడు జనసేన పార్టీ #GoodMorningCMSir అని యాష్ ట్యాగ్ తో రోడ్ల దుస్థితి ప్రభుత్వానికి తెలియజేసే కార్యక్రమాన్ని నేడు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు.. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలైనా ఒక్క రోడ్డు వేసిన ఆధారాలు లేవని ఈ ముఖ్యమంత్రి గాడ నిద్రలో ఉన్నారు అన్నారు.. ఈ ముఖ్యమంత్రిని నిద్రలేపే విధంగా రాష్ట్ర స్థాయిలో జనసేన పార్టీ నిర్వహిస్తున్న డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా కోడూరులోని నాలుగు చోట్ల గతుకుల, గుంతల రోడ్ల వద్ద జనసేన పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారని పేర్కొన్నారు… కార్యక్రమంలో భాగంగా దినకర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనే బలమైన భావజాలంతో వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని ప్రజలు ఒక్కసారి గెలిపించి చూడాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు.. ఈ కార్యక్రమంలో పగడాల వెంకటేశు, వరికూటి నాగరాజు, కనుపర్తి ఈశ్వరయ్య, బీదం నవీన్ కుమార్, గుండు మల్లి ప్రభ, మాదం సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు..