పవన్ కళ్యాణ్ ను కలిసిన రాజారెడ్డి
మంగళగిరి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తిరుపతి నగర అధ్యక్షుడు రాజారెడ్డి మంగళవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతిలో పలు అంశాలను అడిగి పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. జనసేన బలోపేత దిశగా పలు సూచనలు చేశారు. నాయకులను, కార్యకర్తలను కలుపుకొని అధికార పార్టీని ధీటుగా ఎదుర్కోవాలని పవన్ సూచించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-09-at-8.52.34-PM-967x1024.jpeg)