అనాధ పిల్లలకు ఆనందాన్ని పంచిన రాజమండ్రి జనసైనికులు

రాజమండ్రి, ఏకలవ్య చిల్డ్రన్స్ హోమ్ లోని పిల్లల తము పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాని చూడాలని ఉంది అని మనసులో విషయాన్ని హెల్పింగ్ హాండ్స్ అనూప్ జైన్ కి వివరించగా వారు ఈ విషయాన్ని రాజమండ్రి జనసేన ప్రధాన కార్యదర్శి భాషా కి తెలియజేశారు. భాషా వెంటనే స్పందిస్తూ రాజమండ్రి అశోక థియేటర్ లో పిల్లల కోరిక తీర్చేందుకు భీమ్లా నాయక్ సినిమాని జామి సత్యనారాయణ జిల్లా కార్యదర్శి, దాసరి గురునాధ రావు, రాజమండ్రి జనసేన పార్టీ ఉపాద్యక్షుల, కె.ఎస్ ప్రకాష్ రాజమండ్రి కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి ఆసూరి సూధాకర్, పిల్లల కోసం రాజమండ్రి అశోక థియేటర్ లో స్నాక్స్ మరియు కూల్ డ్రింక్స్ అన్ని ఏర్పాటు చేశారు. థియేటర్ మేనేజ్మెంట్ సహకారంతో పిల్లలు భీమ్లా నాయక్ సినిమాని వీక్షించడం జరిగింది. థియేటర్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. థియేటర్లో తెరపై పవన్ కళ్యాణ్ ని చూసిన పిల్లలకు ఆనందానికి హద్దే లేదు… పిల్లలకు ఈ ఆనందాన్ని కలిగించిన రాజమండ్రి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి భాషా కి మరియు వారి మిత్రబృందానికి అనూప్ జైన్, అమీర్ పాషా ధన్యవాదాలు తెలిపారు.