స్వాతంత్ర్య అమృతోత్సవాల్లో రాజాం జనసేన

  • మువ్వన్నెల జెండాతో రాజాం జనసేన భారీ బైక్ ర్యాలీ

రాజాం, 75 స్వాతంత్ర్య దినోత్సవం అమృతోత్సవాల్లో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాజాం జనసేన పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గం నాయకులు ఎన్ని రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజాం నియోజకవర్గం లో మువ్వన్నెల జెండాతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రతి జనసైనికుడు కళ్యాణ్ గారి ఆశయాలతో అనుగుణంగా పనిచేసి దేశ సమగ్రతకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని జనసైనికులు ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాజాం నియోజకవర్గానికి చెందిన నాలుగు మండలాల జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొని దేశ సమగ్రతను, దేశభక్తిని చాటుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *