స్పందనలో వినతిపత్రమిచ్చిన రాజంపేట జనసేన

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గం, గత ఏడాది వచ్చిన వరదలకు మందపల్లి. పులపత్తూరు గ్రామాల్లో ఇళ్ళు పూర్తిగా తుడిచి పెట్టుకుపోవడం జరిగింది. దీనికి ప్రభుత్వం స్పందించి ఇళ్ళు నిర్మించకపోవడంతో గుడారాలు వేసుకుని జీవిస్తున్నారని వాళ్ళకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్ గిరిష కి జనసేనపార్టీ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు అతిగారి దినేష్, రామ శ్రీనివాస్, హరి రాయల్ నేతృత్వంలో వరద బాధిత ప్రాంతాల వాసులు, మరియు జనసైనికులు నరహరి, శ్రీనివాసులు, అజిస్ తదితరులు పాల్గొన్నారు.