రాజ్యాంగ నిర్మాతకు రాజంపేట జనసేన ఘననివాళి
అన్నమయ్యజిల్లా రాజంపేట పట్టణంలో డా.బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో భాగంగా జనసేనపార్టీ తరపున ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి రాజ్యాంగ ఫలాలు అందాలనే స్పూర్తితో ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని జనసేన పార్టీ తరపున తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-14-at-16.47.21-1024x577.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-14-at-16.47.21-1-461x1024.jpeg)