రాజాం నియోజకవర్గాన్ని జనసేన అడ్డాగా మార్చాలి: ఎన్ని రాజు
రాజాం నియోజకవర్గ నాయకులు ఎన్ని రాజు పిలుపుమేరకు రాజాం నియోజకవర్గంలో లచ్చారాయపురం, నాయిరాలవలస, గ్రామాల్లో ఆదివారం జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలసస్వి, ఎచ్చెర్ల నియోజకవర్గం నాయకురాలు కాంతి శ్రీ, పాలకొండ నియోజకవర్గం నాయకులు అల్లు సాయి పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యులు మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ రాజాం నియోజకవర్గాన్ని జనసేన పార్టీ అడ్డాగా చేయాలని రాజాం జనసేన పార్టీ నాయకులు ఎన్ని రాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి పాలకొండ జనసేన పార్టీ నాయుకులు మత్స పుండరికం, పోరెడ్డి ప్రశాంత్, పొట్నూరు రమేష్ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-03-at-8.17.18-PM-1024x477.jpeg)