పలువురిని పరామర్శించిన రాజానగరం జనసేన నాయకులు

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి తనదైన శైలిలో పార్టీ సేవలందిస్తున్న జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ మెంబెర్ జమాల్ అలీ (సోను) ప్లేట్లెట్స్ తగ్గిపోవడం కారణంగా కొన్ని రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న జనసేన నాయకుడిని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి రాజానగరం నియోజకవర్గం నాయకులు మైరెడ్డి గంగాధర్, బొబ్బరడా వాసు, రాజానగరం మండల కమిటీ మెంబెర్ ముత్యం నరసింహ మూర్తి, మండల కమిటీ మెంబెర్ నరేంద్రపురం బాపిరాజు, పాత వెలుగుబంధ సోషల్ మీడియా ఇంచార్జ్ ఏడిద వీరబాబు, జనసేన పార్టీ యూత్ నున్న రాజా, రాజానగరం జనసేన పార్టీ యూత్ ఐకాన్ పల్లా హేమంత్ గారు అందరు కలిసి రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ నాయకత్వంలో సోను పరిస్థితి తెలుసుకుని భవిష్యత్తులో జనసేన పార్టీ తరఫున అన్ని విధాల అండగా ఉంటామని మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ రాజానగరం మండల కమిటీ వైస్ ప్రెసిడెంట్ నాగవరపు భానుశంకర్ తండ్రి నాగవరపు సత్యనారాయణ అనారోగ్యం కారణం సర్జరీ చేయించుకోవడం జరిగింది. వారిని దివాన్ చెరువు వారి ఇంటి నందు పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.