మానవత్వం చాటుకున్న రాజేష్ యాదవ్

చిత్తూరు, ఆదివారం రాత్రి 11:15 నుంచి 11:30 మధ్యలో వైకుంఠపురం ఆర్చ్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తికి యాక్సిడెంట్ అవడం జరిగింది. అటు వైపు వెళ్తున్న వారిని ఎవరిని సహాయం కోసం పిలిచినా కూడా ఆగాక పొగా.. ఆటో వారిని నిలిపినా.. నిలపక పోవడంతో 108 కి కాల్ చేయగా వారు కూడా.. అతను ఎవరు, అతను డ్రింక్ చేసి ఉన్నారా, అతను ఫుల్ నేమ్ ఏమిటి అని అడుగుతూ.. కాలయాపన చేశారు గానీ.. అతనిని హాస్పిటల్ కి తీసుకు వెల్దామనే ఆలోచన ఒక ఆటో వారికి గానీ, ఆంబులన్స్ వారికి గాని రాలేదు. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న జనసేన నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్ (ఆర్.జె.యాదవ్) యాక్సిడెంట్ జరిగిన వ్యక్తిని తన కారులో రియా హాస్పిటల్ కి చేర్చడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో తక్షణం స్పందించి ప్రమాదానికి గురైన వ్యక్తిని రక్షించడంతో.. ఎవరికి ఆపద వచ్చినా సహాయం చేయడంలో జనసేన ముందు ఉంటుందని పలువురు రాజేష్ యాదవ్ ను అభినందించడం జరిగింది.