కరోనా సాయంగా స్టాలిన్కు రూ.50 లక్షలు అందించిన రజనీకాంత్
చెన్నై: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. వైరస్ బారినపడి రోజుకు వేలాది మంది మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపు మేరకు సిఎం రిలీఫ్ ఫండ్కు సినీ నటులు తమ వంతు సాయం చేస్తున్నారు. తాజాగా సూపర్స్టార్ రజనీకాంత్ సిఎం స్టాలిన్ను కలిసి రూ. 50 లక్షల రూపాయల్ని విరాళంగా ఇచ్చారు. అలాగే హీరో విక్రమ్ కూడా.. రూ. 30 లక్షల రూపాయలు ఆన్లైన్ ద్వారా కోవిడ్ రిలీఫ్ ఫండ్కి జమ చేశారు. ఇప్పటికే సూర్య కుటుంబం కోటి రూపాయలు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.