రోడ్ల దుస్థితిపై రాజోలు నియోజకవర్గ జనసేన, టీడీపీల డిజిటల్ క్యాంపెయిన్
రాజోలు నియోజకవర్గం: జనసేన పార్టీ మరియు తెలుగు దేశం పార్టీఉమ్మడి సారథ్యంలో.. రాజోలు నియోజకవర్గం, చింతలమోరిలో “గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది” నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో జనసేన-టిడిపి పార్టీల సమన్వయకర్తలు గుండుబోగుల పెదకాపు- గొల్లపల్లి సూర్యారావు, రాజేశ్వరరావు బొంతుల ఆధ్వర్యంలో చింతలమోరి నుండి శంకరగుప్తం రోడ్లపై ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో చింతలమోరి సర్పంచ్, రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, ముఖ్య నాయకులు మరియు టీడీపీ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, ముఖ్య నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, గ్రామ అధ్యక్షులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-19-at-11.50.28-AM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-19-at-11.50.28-AM-1-1024x470.jpeg)