రాజోలు నియోజకవర్గ జనసేన ఐటీ విభాగం ఆత్మీయ సమావేశం

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీ ఐటీ విభాగం సమావేశం శివకోడు కల్యాణమండపంలో శనివారం రాజోలు నియోజకవర్గం ఐటీ కో ఆర్డినేటర్ యెనుముల లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో ఐటీ విభాగాన్ని బూత్ స్థాయిలో బలోపేతం చేయడానికి కార్యాచరణ సిద్ధం చేసాం అని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఐటీ కో ఆర్డినేటర్ గాలిదేవరా తామేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఐటీ కో ఆర్డినేటర్ గాలిదేవరా తామేష్, ముమ్మడివరం ఐటీ కో ఆర్డినేటర్ సత్య ప్రకాష్, పి.గన్నవరం ఐటీ కో ఆర్డినేటర్ శివకుమార్, మండపేట ఐటీ కో ఆర్డినేటర్ ప్రసన్న కుమార్, రాజోలు నియోజకవర్గం ఐటీ విభాగం సభ్యులు పాల్గొన్నారు.