క్రియాశీలక వాలంటీర్లను సన్మానించిన రాజోలు జనసేన

కోనసీమజిల్లా, రాజోలు నియోజకవర్గం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాజోలు నియోజకవర్గంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించిన సభ్యులకి శాలువాలతో సత్కరించి, ప్రమాద భీమా ధృవీకరణ పత్రంతో కూడిన, సభ్యత్వ కిట్స్ అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు, వీర మహిళలు, క్రియాశీల కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు.