మలికిపురం పోలీస్ స్టేషన్లో వైసిపిపై ఫిర్యాదు చేసిన రాజోలు జనసేన

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, జనసేన పార్టీ మలికిపురం మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు ఆద్వర్యంలో శనివారం మలికిపురం పోలీస్ స్టేషన్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తి గత దూషణలు చేస్తున్న వైసిపి నాయకులు మరియు వెబ్‌సైట్ ఛానల్స్ పై ఫిర్యాదు చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు బొంతు రాజేశ్వరరావు, రాపాక రమేష్ బాబు, గుండుబోగుల పెద్దకాపు, రవి కిరణ్, జక్కంపూడి వాసు, మంగెన నాగభూషణం, బోణం సాయి, మత్తి జయప్రకాశ్, కాకర శ్రీనివాస్, నాగేశ్వరావు, సుందర బ్రమ్మయ్య, దొమ్మేటి సత్యనారాయణ, జనసేన ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డ్ నెంబర్లు, జిల్లా సంయుక్త కార్యదర్శి, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.