రాజోలు మండల జనసేన కమిటి సన్మాన మహోత్సవం

రాజోలు నియోజకవర్గం: రాజోలు మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాజోలు మండల కమిటి సన్మాన మహోత్సవం కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం  జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన కుటుంబసభ్యుల భద్రత కోసం చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ కిట్లను క్రియాశీలక సభ్యులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డి.ఎం.ఆర్ శేఖర్, బొంతు రాజేశ్వరరావు, మండల ఎంపీపీలు, మండల అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు, వీరమహిళలు, జనసైనికులుఅధిక సంఖ్యలో పాల్గొన్నారు.