అక్రమ అరెస్టులకు నల్ల బ్యాడ్జీలతో రాజోలు జనసేన నిరసన

రాజోలు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జనసేన పార్టీ రాజోలు మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాస్ అధ్వర్యంలో విశాఖలో జనసేన నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగా నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జిల్లా కార్యదర్శి గుండా బత్తుల తాతాజీ, జనసేన పార్టీ మలికిపురం ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము, గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, గొల్లమందల పూర్ణ భాస్కరరావు, మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, అల్లూరి రంగరాజు, ఎంపీటీసీలు దార్ల కుమారి లక్ష్మి చినబాబు, బైర నాగరాజు, ఉండపల్లి అంజి, కాట్న రాజు, కోళ్ల బాబి, వెంకన్న, శ్రీను, దొరబాబు, చింతా ప్రసాద్, వీర మహిళలు, జనసైనికులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, వార్డ్ మెంబర్లు, గ్రామశాఖ అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, క్రియాశీలక వాలంటీర్లు మరియు సోషల్ మీడియా ప్రతనిధులు పాల్గొన్నారు.