రాజోలు, సఖినేటిపల్లి గ్రామంలో ముత్యాలమ్మ గుడి వద్ద రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సఖినేటిపల్లి మలికిపురం మండలాల చిరు పవన్ చరణ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరంలో 52 మంది రక్తదానం చేయడం జరిగింది. మరియు మెగా ఉచిత మెడికల్ క్యాంప్ జరిగింది మెడికల్ క్యాంప్ లో 300 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమాలు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:
Post Comment