రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రఘునాథరెడ్డి పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించిన రామ శ్రీనివాస్

రాజంపేట: అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లె మండల కేంద్రానికి సమీపంలోని రెడ్డన్నగారిపల్లికు చెందిన అమలాపురం రఘునాథ్ రెడ్డి (55) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శుక్రవారం ఉదయం శ్రీకాళహస్తి నుండి రాజంపేటకు వెళ్లి సుండుపల్లె తన స్వగ్రామం రెడ్డన్నగారిపల్లెకు వస్తుండగా సానిపాయి సమీపంలోని రాజంపేట ఘాట్ రోడ్ లో బుల్లెట్ బైక్ పై వస్తుండగా ప్రమాదం జరిగి తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. రఘునాథరెడ్డి ఉద్యోగరీత్యా శ్రీకాళహస్తి దేవాలయంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన స్వగృహం నందు భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.