గాంధీ మహాత్మునికి నివాళులు అర్పించిన రామ శ్రీనివాస్

అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి. సుండుపల్లి మండల కేంద్రం నాలుగు రోడ్ల కూడలిలో జాతిపిత మహాత్మాగాంధీ 75వ వర్ధంతి సందర్భంగా… ఆయన చిత్రపటానికి జనసేన నాయకులు రామ శ్రీనివాస్ పలువురు నేతలతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా రామ శ్రీనివాస్ మాట్లాడుతూ సత్యాగ్రహం అనే ఆయుధంతో అహింసా మార్గంలో నడిపించిన మహాత్ముడు మనము స్వాతంత్ర భారత దేశంలో స్వేచ్ఛగా ఉన్నామంటే ఎంతో మంది మహనీయులు ప్రాణత్యాగలతోనే అని నేటి తరం గుర్తించుకోవాలి, వారి స్పూర్తితో అందరూ చైతన్యవంతులవ్వి మన సమాజాన్ని భవిశేత్తు లో బాధ్యతగా కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఆధారపడి ఉందని రాబోయే భావితరాలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా భారతదేశ ప్రజల బానిసత్వాన్ని రూపుమాపడానికి తన జీవితాన్ని ధారపోసిన మహాత్మా గాంధీ 75వ వర్ధంతి కార్యక్రమంలో జనసైనికులు, వివిధ సంఘాల నాయకులు, రైతులు, చెన్నంశెట్టి రామంజులు, తోట రవీంద్ర, సుబ్బరాజు, వెంకటయ్య, కృష్ణారెడ్డి, జగిలి రమణ, భాష, యువకులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.