పాముల చంద్రమౌళికి నివాళులు అర్పించిన రామ శ్రీనివాస్

అన్నమయ్య జిల్లా (ఉమ్మడికడపజిల్లా) , టి. సుండుపల్లి మండల పరిధిలోని రాయవరం గ్రామానికి చెందిన ఆర్ఎంపి వైద్యుడు, క్రీడాకారుడు, మాజీ హోంగార్డు మరియు తరుణం రిపోర్టర్ అయిన పాముల చంద్రమౌళి తిరుపతిలోని అమర రాజా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హఠాన్మరణం చెందారని విషయం తెలుసుకున్న రాజంపేట అసంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ ఆయన మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి, అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మృతి వార్త విని చూడ్డానికి పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, గ్రామ మరియు మండల వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *