శ్రీశ్రీశ్రీ బలిజపల్లి గంగమ్మ జాతరలో పాల్గొన్న రామ శ్రీనివాస్

రాజంపేట నియోజకవర్గం: రాజంపేట పట్టణంలోని బలిజపల్లిలో వెలసిన శ్రీశ్రీశ్రీ బలిజపల్లిగంగమ్మ తల్లి వారి జాతర సందర్భంగా జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. అమ్మవారికి భక్తాదులు, బోనాలు, సమర్పణలు, మొక్కులు చెలించుటకు, వివిధ రకాల సాంస్కృతి సంప్రదాయం ప్రకారం చల్ల బండ్లు, డప్పువాయిద్యాలు, బాణసంచాలతో అంగరంగ వైభవంగా పట్టణ ప్రజలు, చుట్టు పక్కల గ్రామస్థులు, మండల, తాలూకా, జిల్లా, స్థాయిలో అందరూ కలిసి, భక్తులు, మొక్కులు చెలించుటకు ఘనంగా జాతర మహోత్సవంలో భారీ ఎత్తున భక్తులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, స్థానికులు, గ్రామస్థులు, యువకులు, మహిళలు, జిల్లా స్థాయిలో వివిధ ప్రాంతాల నుంచి బంధుమిత్రులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.