విలేకరి ఓబులేసుకు రామ శ్రీనివాస్ నివాళి

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గం, టి.సుండుపల్లి మండల పరిధిలోని పాపన్నగారిపల్లికి చెందిన మాజీ వార్త విలేకరి మరియు ఎం.ఆర్.పి.స్ మండల అధ్యక్షుడు ఓబులేసు మృతి చెందారు, విషయం తెలుసుకున్న జనసేన నాయకులు రామ శ్రీనివాస్ ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించి, అనంతరం అక్కడి స్థానిక గ్రామస్థులు, ప్రజాసంఘాల నాయకులు, వివిధ మాధ్యమాల నేతలతో కలిసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పడం జరిగింది.